LOCAL WEATHER

30, ఆగస్టు 2012, గురువారం

వాక్కాయ పచ్చడి......


వాక్కాయలు సీజనల్గా వచ్చే కూరలలో ఒకటి......ఇవి మా చిన్నప్పుడు ఒకే రంగులో కనపడేవి....ఇవి మాంచి ఘాటుగా ఉంటాయి.


కానీ, ఇప్పుడు రంగులో కాయలు కూడా ఎక్కువ కనపడుతూ బాగా దొరుకుతున్నాయి.....



సరే, కాయలు అన్ని చోట్లా దొరుకుతాయో లేదో తెలియదు కానీ, విజయవాడ పరిసర ప్రాంతాలలో చాలా బాగా దొరుకుతాయి......వీటితో వాక్కాయ పప్పు, వాక్కాయ పచ్చడి చేసుకోవచ్చును.


పప్పు అంటే ఏమున్నది......మామిడికాయ పప్పు, దోసకాయ పప్పులాగానే కందిపప్పు ఉడుకుతున్న సమయంలో వీటిని వేసి మిగిలిన పప్పులు లాగానే చెయ్య వచ్చును....కాకపోతే ముందుగా వీటిని మధ్యకు తరిగి వాటిలో ఉన్న గింజ భాగాన్ని తోలగించాలి....ఇదిగొ ఇలాగ....

పచ్చడి చేసే విధానం.....

కావాల్సిన వస్తువులు....

1] వాక్కాయలు ఒక చిన్న డబ్బాడు ....


2] ఎండుమెరపకాయలు కారానికి తగ్గట్టు, ఆవాలూ, జీలకర్ర ....కొద్దిగా, మినపప్పు, శనగ పప్పు ....కొంచం.


3] సగం చెంచాడు పంచదార....
4] తగినంత ఉప్పు.
***


ముందుగా కాయలను బాగా కడిగి వాటిని మధ్యకు తరిగి వాటిలొ ఉన్న గింజలను తొలగించాలి. తరవాత, వాటిని నూనెలో చక్కగా మెత్తగా ఉడికేటట్లు వేయించాలి ......కాయలుగా కూడా నూనెలో ఉడక పెట్టుకోవచ్చును. కానీ పగిలి మీద పడే అవకాశం ఉన్నది..........[దీనిని ఇంకోలాగా కూడా చెయ్య వచ్చును.....ముందరగా నూనెలో తాలింపు ఎండుమెరపకాయలతో సహా వేయించి.......దానిలోని వేగిన ఎండుమెరపకాయలను మాత్రం తీసి, తాలింపు నూనెలోనే మధ్యకు తరిగి గింజలు తీసేసిన వాక్కాయలను వేయించుకోవటం చెయ్య వచ్చును. ఇప్పుడు ఎండుమెరపకాయలను మాత్రం మిక్సీలో వేసుకోవాలి......ఇదొక పద్ధతి.]


ఎండుమెరపకాయలూ, శనగపప్పు, మినప పప్పు, జీలకర్ర, ఆవాలను కొద్ది నూనెలో వేయించుకోవాలి. వీటిని మిక్సీలో వేసి ఒకసారి కొద్దిగా తిప్పి వదిలిలేస్తే మనకు కావాలిసిన పద్దతిలో కారం మిక్సు తయారవుతుంది.


ఇప్పుడూ, వేయించి పెట్టుకొన్న వాక్కాయలూ, ఎండుమెరపకాయల మిక్సింగునూ ఒక గిన్నెలో వేసి, సగం చెంచాడు పంచదార.....తగినంత ఉప్పు వేసి చెంచాతో కలపాలి. అంతే వాక్కాయ పచ్చడి మంచి వాసనతో, రుచితో రెడి అవుతుంది. బాగా ఆకుపచ్చగా ఉన్నకాయలు మంచి రుచితో పాటూ ఘాటుగా కూడా ఉంటాయి....



27, ఆగస్టు 2012, సోమవారం

రోడ్లమీద నడిచే రైళ్ళు.....



రోడ్లమీద  నడిచే  రైళ్ళు..... అదే  ట్రాములు మన దేశంలో ఒక్క కలకత్తా నగరంలోనే  కనపడతాయి.  130 ఏళ్ళ  పైగా  చరిత్ర  కలిగిన  ట్రాములు సామాన్య  జనంలో కలిసి మెలిసి పోయినాయి. ఎప్పుడో  బ్రిటీషు వారి  కాలంలో ప్రవేశ పెట్టిన ట్రాములు ఇప్పటికీ కోల్కతా జనానికే కాదు...అక్కడికి అతిధులుగా వచ్చిన వారికి కూడా తమ సేవలు అందిస్తున్నాయి. మొదట్లో గుర్రాలు లాగేవట....తరవత రోజులలో బొగ్గుతో నడిచే ఇంజన్లూ.....తరవాత, కరెంటు ఇంజన్లూ వాడకంలోనికి వచ్చినాయి. వీటికి రెండు బోగీలు మాత్రమే ఉంటాయి. అందుల్లో ఒకటి ఫస్టు క్లాసూ....అదీ చవుకే....వీటి గురించి మరింత తెలుసుకోవలంటే లింకు నొక్కండి. TRAMS


వీటిలో ప్రయాణం అతిచవుక. మనం మన సిటీ బస్సుల్లో   10, 15   రూపాయలు పెట్టే దూరాన్ని కేవలం మూడున్నర, నాలుగున్నర రూపాయలకే చేరవచ్చును. మూడున్నరా...నాలుగున్నారా..ఇదెక్కడో విన్నట్లు లేదూ....!!! అవును, మనమెప్పుడో మరిచిపోయిన అర్ధరూపాయ  నాణేన్ని ట్రాము కండెక్టర్లు చూపించారు. సందర్భంగా వీటి కండెక్టర్ల  గురించి కూడా చెప్పుకోవలసినదే ..... ఒక్క  అర్ధరూపాయకూడా  మిగుల్చుకోకుండా చక్కగా చిల్లర ఇచ్చేస్తారు. అర్ధరూపాయలు మన దగ్గర చెల్లుబాటే కాకున్నాయి. వాటి పనైపోయిందని మనం అనుకుంటున్నాము. అయితే, రిజర్వు బాంకు వారు  కొత్తగా  కూడా  అర్ధరూపాయలను  ముద్రిస్తున్నారన్న  సంగతి    ట్రాముల  పుణ్యాన  తెలిసింది.


కనొక  టైములో వీటిని ట్రాఫిక్కుకి అంతరాయంగా ఉన్నాయన్న కారణం చూపించి, వారి ఎర్ర ప్రభుత్వం తొలగించాలని చూసింది.....కానీ, కాళీఘాట్ ప్రజలు కన్నెర్రజేయటంతో ప్రతిపాదన విరమించుకొన్నారు. అయితే, వీటి సేవలను కుందించారు. ఒకప్పుడు కలకత్తా రైల్వే స్టేషను[హవురా]నుండీ నగరంలో అన్ని వైపులకీ విస్తరించి వుండేవి.....స్టేషను నుండి హవురా బ్రిడ్జి వరకూ ఉండే లైనులు తొలగించారు. తరవాత, వీటి కాలాన్ని కూడా కుదించి సాయంత్రం ఆరులోపలే మెయిన్ రోడ్లవైపులకి రాకుండా చేశారు....



అయినప్పటికి, ఇప్పటికీ వీటి సేవలు చక్కగా అందిస్తూనే ఉన్నాయి.



24, ఆగస్టు 2012, శుక్రవారం

"ప్రైవేటు" ....?? అంటే అదేమన్నా అంటరానిదా......???


గత రెండు రోజులు కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిరసన తెలియజేసినాయి.... బాగానే ఉన్నది.......ఎవరైనా తమ ఉనికి కోసం ఏదైనా చెయ్యచ్చు....కానీప్రైవేటు అంటే అదేదో అంటరానిది అయినట్లు, భూత పిశాచాలైనట్లు చిత్రీకరించి వారి నాయకులు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది.

ఎందుకంటే, "ప్రైవేటు వ్యతిరేకులు" మిగిలిన రంగాలలో విదేశీయులు వస్తున్నారనీ, ప్రైవేటు పరమైపోయినాయనిగానీ ఏమాత్రం చింత లేకపోగా......అవి రావటం వలననే పోటి తత్వం పెరిగి రేట్లు తగ్గుతాయనీ, మంచి సేవలు అందుబాటులోనికి వస్తాయనీ వాదించి, సేవలను పొందుతున్నవారే......పెద్ద పెద్ద కార్పొరేటు సంస్థల  మీద  ఆధార పడి బ్రతికేవారే........

విధంగా ద్వంద విధానంగా మాట్లాడే " జాతీయవాదులలో జాతీయతత్వం ఎంత ఉన్నదో" తెలుసుకోవాలంటే వీరి కొన్ని కార్య కలాపాలను పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది.

1] ఏదైనా బ్యాంకులు   కానీ ప్రభుత్వ రంగ ఆఫీసులలో వారి వారి ఉత్తర ప్రత్యుత్తరాలను భారత ప్రభుత్వ సంస్థ అయిన తపాల శాఖను వినియోగిస్తున్నారా....?

@ ఉపయోగించరు. కారణం తమ ఆఫీసుకు వచ్చి ఉత్తరాలను తీసుకెళ్ళరనీ, ప్రైవేటు కొరియర్లు అయితే సర్వీసు బాగుంటుందనీ వీరి వాదన.......తమ సాటి సంస్థ పైకి రావటానికి, కనీసం వీరు తమ సీట్లలో నుండి కూడా కదలరు.........


2] వీరిలో ఎవరైనా తమకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభుత్వాసుపత్రికి వెళతారా......?


@ వెళ్ళరు... అక్కడ  సరిగా చూడరట.....అందుకని కార్పొరేటు  ఆసుపత్రికే  వెళతారు.......కాస్త జ్వరం వచ్చినా సరే......ఇలాంటి వారందరూ
ప్రభుత్వాసుపత్రికి  వెళితే  అక్కడి వారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు కదా...!!!

3] వీరి పిల్లలను మునిసిపల్, గవర్నమెంటు స్కూళ్ళలో చేరిపిస్తున్నారా......?


@ చదివించరు, అక్కడ ఎవరుపడితే వారు చదువుతారట......తమ పిల్లలు చెడిపోతారు, అందుకని కార్పొరేటు స్కూళ్ళలోనే చేర్పిస్తారు.....!!!


4] తమ పిల్లలల ఉద్యోగాలకి నెలకు లక్షలు వచ్చే ప్రైవేటు సంస్థలే కావాలి... లేదా "బాగా" డబ్బులోచ్చే  మాటైతే  గవర్నమెంటు  ఆఫీలైనా పరవాలేదు....  మరి.....సేవే పరమావధిగా ఉన్న గవర్నమెంటు ఆఫిసులలో చేరి ప్రజలకి సేవ చెయ్యచ్చుగా........?

@ చెయ్యరు, దానికి  వేరెవరో బలైపోవాలి.....


5] ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంటు సెల్ ఫోనులు వాడుతున్నారు....? వారి కార్యాలయాల్లో గానీ బీఎస్సెన్ఎల్  ఫొనులు వాడబడుతున్నాయి....?



@ వాడరు....ప్రైవేటు స్కీములకి లొంగి,  తమ జాతీయతత్వాన్ని ప్రైవేటు  స్కిములకి బలిస్తారు.......

ఇలా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి. వారు మటుకూ ప్రభుత్వరంగ  సంస్థలని ప్రొత్సహించరు, కానీ తాము మటుకూ ప్రభుత్వరంగ  సంస్థల్లోనే ఉండాలి........ ఇంతకీ వీరి కౌంటరు ముందుకు వచ్చి కోట్లూ లక్షలూ డబ్బులు కట్టి వీరి లావాదేవీలని నడిపేదెవరూ....??? కేవలం గవర్నమెంటుకి చెందినవారేనా, కానే కాదు......కనీసం 98 శాతం  ప్రైవేటు సంస్థలకి చెందినవారే.....సొమ్ము ప్రజలది,  సోకు ఉద్యోగులదీ అయింది.......


విధమైన ద్వంద విధానాలతో చాలా వర్గాలవారే తయారైనారు. తమకి కావాలిసిన సర్వీసు మటుకూ చక్కగా జవాబుదారీ విధానంలో ఉండి.....వీరికి ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద ఫిర్యాదు చెయ్యగానే వారిని ఉద్యోగాలనుండి తొలగించెయ్యాలి.....తాము మటుకూ ఏమాత్రం జవాబుదారులుగా ఉండకుండా.......ఏదైనా సమస్య వస్తే "కావాలంటే  మెనేజరుకు కంప్లైంటు చేసుకోండని" సవాలుగా మాట్లాడుతారు......


వీరికి
మటుకూ పేద్ద పెద్ద షాపింగు మాల్సూ, విదేశీ వస్తువులూ, విదేశీ సేవలు కావాలి......దానివలన నలిగి, మునిగిపోయే సామాన్యుల బాధ మడుకూ అఖర్లేదు......తమదాకా వస్తే ప్రైవేటు అనేది భూతాలూ పిశాచాలునూ......



కొసమెరుపేమంటే
పేద బడుగు వర్గాల వారికి అండదండగా ఉండాలిసిన 
మన ఎర్ర జెండాల వారు
ఖచ్చితంగా నెలవారీ జీతాలు పొందే వారి తోకను పట్టుకొని తిరగటం, ......అన్ని చోట్లా ఎర్ర జెండాలని వ్యతిరేకించే ఉద్యోగస్తులు
తామే ఎర్ర జెండాలని పట్టుకొని ఉద్యమించటం........


@@@@@@@@@@@@@@@
జై హింద్
@@@@@@@@@@@@@@@