LOCAL WEATHER

6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఒబామా గారు ముందర మీ దేశం సామరస్యం గురించి చూసుకోండి...!!!

ఫోటో కర్టేసి:ఈనాడు 

ఇప్పుడేదో భారతదేశంలో సరిగా లేదంట...
భారత్ లో  ఉన్న  పరిస్తితికి గాంధీగారు బాధపదతారట...
ఇన్ని మతాలవారు సమాన హక్కులతో బ్రతుకుతున్న 
భారతదేశంలో మతసహనం లేదు అనే జోకు పేల్చారు... 
చివరిగా రెండు ముక్కలు వారి గురించి చెప్పుకుని 
అదంత ముఖ్యమైనది కానట్లు 
 గాంధీగారి పేరు సాకుతో భారత్ గురించి అవాకులు చెవాకులు పేలిన ఒబామా.
 ఇక్కడే సహనం లేకపోతే భారత్ ఎప్పుడో అమెరికా అయ్యేది కదా...!!!

120 కోట్ల ప్రజల సహనం గురించి ఆయనగారు ఏదో ఆయనకీ తోచింది చెప్పేస్తున్నారు....
నిజానికి 120 కోట్ల ప్రజలు అసహనానికి గురి అవుతే ఏమవుతుంతో ఆయనకీ తెలియంది కాదు...
బహుశా మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా 
యురప్పు మొత్తం  జనాభా 120 కోట్లు ఉండి ఉండదు...
ఉన్న ఆ కాస్త జనమే కొట్టుకుని 
ప్రపంచం మొత్తాన్ని బాధపెట్టి కోట్ల మందిని చంపింది కాక...
అదేదో గొప్ప కార్యం అయి 
లోక కళ్యాణానికే తాము చేసినట్లుగా 
కేవలం జర్మని, ఇటలి, జపాను దేశాలే ప్రపంచ శత్రువులు అయినట్లు..
వారు మాత్రమే ప్రపంచం పై దురాక్రమణ చేసినట్లు
మిగిలిన యురప్పు దేశాలు పతివ్రతలు అయినట్లు చూపించారు.
అసలి లోపలి విషయం అయితే, 
తాము ఆసియా/ఆఫ్రికా/అమెరికా దేశాల మీదపడుతుంటే
ఈ మూడు దేశాలు మనమీద పడుతున్నాయి అన్న అక్కసుతో
ఆ మూడు దేశాలని దోషులుగా నిలబెట్టి 
వాటిని నాశనం చేసిందే కాక 
ఆ తప్పుని కప్పిపెట్టటానికి 
వాటికి "ప్రపంచ యుద్ధం" అని పెరేట్టేసుకున్నారు..
ఇప్పుడు వారేదో ప్రపంచ శాంతికి ప్రతినిధులుగా వారికి వారే అనుకుంటున్నారు....
ఓ ప్రక్కన ఆయుధాల వ్యాపారాలు చేసుకుంటూనే....
వీళ్లా భారత్ గురించి వాగేది
 అసలు అర్హత అనేది ఉన్నదా...


బాబూ ఒబామా గారు,  ముందర  మీ  దేశం  సంగతి చూసుకోండి...
మీ యురప్పు మిత్ర దేశాల గురించి ఆలోచించండి. 
అక్కడి మీ సహచర నీగ్రోల దుస్తితి మరియూ ఇతర మతస్తుల గురించి ఆలోచించండి... 
మీ దేశంలో పేరుకి ప్రజా సామ్యమే కానీ 
సరిగ్గా ప్రజలందరూ సమాన హక్కులు పొందుతునారా అనే సంగతి చూడండి...
అక్కడి అసియన్స్ ప్రజలు మాత్రమే బయటి నుండి వచ్చిన వారుగా చూస్తూ, 
యురోపియన్లు అక్కడి వారే అన్నట్లుగా ఉండే మీ వివక్ష చట్టాల గురించి ఆలోచించండి... 
వేడుకకు అతిథిగా వచ్చి ఆ యింటినే విమర్శించే మీ సుగుణం గురించి ఆలోచించండి... 

ఇక్కడ మాకు మత సహనం ఉండబట్టే అన్ని మతాల వాదనలు వినపడుతున్నాయి... 
మీ దేశంలో రెండు భవనాలని కూల్చినంతమాత్రానే
మీ దేశం మరియు మీ మిత్ర దేశాలలో ఎంతమంది ముస్లిం ప్రజలని హత్యలు చేశారో...
ఎన్ని మసీదులు కూల్చారో మాకు చెప్పకపోయినా మీకు తెలుసు...
ఇప్పటికీ ముస్లిమ్స్ లాగా ఉండే అక్కడి శిక్కులు 
పడే బాధలు చూస్తే...ఇక ముస్లిమ్స్ గతి ఏమిటో అందరికి తెలుస్తోనే ఉన్నది...
 ఆ రెండు భవనాలని కూల్చినందుకు 
రెండు దేశాలని నాశనం చేసేంత సహనం మాకు లేదు... 
అందుకనే 
మీ లాంటి వారు వచ్చి తిని పోయిన తరవాత
 పిచ్చి వాగుడులు వాగగలుగుతున్నారు... 



మా గాంధిజీ బాధ గురించి  కన్నా 
నీగ్రోలు మరియూ బడుగు జీవుల గురించి ఆలోచించి 
హత్యలకి గురైన 
మీ మార్టిన్ లూధర్ కింగ్ మరియూ అభ్రహాం లింకన్ లాంటి 
నాయకుల బాధని గురించి ఆలోచించి వారి బాధని ఇప్పటికైనా తీర్చండి...
సరిగ్గా చూస్తే మా దేశానికి సముద్ర మార్గానికి కనిపేట్టటానికి బయలుదేరినప్పుడే 
"మీ దేశం అనేది ఉన్నదని తెలిసింది" అన్న సంగతి తెలుసుకోండి.
అప్పటికే మా దేశంలో వ్యాపారం, మతసామరస్యం తదితారాలు ఉండబట్టే 
మీ యురోపియన్లు-అరబ్బులు మా దేశం మీదకు ఎగబడ్డారు... 
కాబట్టి మా సహనం గురించి మీరు కొత్తగా మాకు చెప్పవలసిన పనిలేదు....




జై హింద్ 




@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి