LOCAL WEATHER

11, సెప్టెంబర్ 2014, గురువారం

చేసిన పాపం ఎక్కడికి పొతుంది...???


పాపమా...చేశారా.... ఎవరూ... ఏమా కధ... ఏమున్నది ఆంధ్రప్రదేశ్‌లో గత పది ఏళ్ళుగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మన మీడియా వారు చేసిన పాపము... ఉద్యమాలు మొదలులో ఉన్నప్పుడు, ఆ ఉద్యమాలు ఊపందుకొటానికి మన మీడియాలు ఎంతో కృషి చేసినాయి... ఎక్కడైనా నలుగురు కూర్చొని కొద్దిగా అరచినా సరే, అక్కడికి పోయి వారిని లైవులో రాష్ట్రమంతా చూపించేసినాయి... మన మీడియాలు అన్నీ. ఇందులో పాపమేమున్నది....

దీనిలో పాపము ఏమీ లేదు... కానీ, తరవాతి కాలంలో ఆ ఉద్యమం కొద్దిగా పెరిగి, ఆ అవేశంలో ఉద్యమ ప్రాంత నాయకులు వాగే ప్రతీ వాగుడినీ నిర్మొహమాటంగా తమ మీడియాలో చూపించేసినాయి...వ్రాసేసినాయి... మచ్చుక్కి కొన్ని వ్రాయగలిగిన బూతులు...వాల్లు కోతులు, కుక్కలు, నక్కలు...[పై వారి దగ్గరున్నదే నది అయినట్లు...దిగువ వారిది గొయ్య అయినట్లు] మా నీళ్ళు దొబ్బేస్తున్నారు, వాళ్ళు దొంగలూ...దోచేస్తున్నారు...మెడకాయలు కోసేస్తాము....పండక్కి వెల్లిన వారు తిరిగి రారు...ఇలా ఒకటేమిటి అన్ని రకాల బూతుల్నీ వాళ్ళు ఉద్యమం ముసుగులో తిట్టేస్తుంటే... కనీస జ్ఞానం లేని మన మీడియా వారు, రాష్ట్ర ప్రజలందరికీ కనపడేట్లూ వినపడేట్లూ చేసేశారు... వాళ్ళ బూతుల వీడియోలు ఇప్పటికి యు ట్యూబ్ లో మూలుగుతున్నాయి.

తిట్టే వారు తిడుతున్నారు...వినేవారు వినలేరేమో అనే కనీసం జాలీ దయా చూపించకుండా...ఆ ఉద్యమ ప్రాంతములో మాత్రమే వినపడవలసిన మాటలని...ఉద్యమం లేని...తిట్టించుకునే ప్రాంతంలో కూడా చూపించేశారు... మిగిలిన ప్రాంతం ప్రజల అభిమానం దెబ్బతింటుంది, వారికి అవమానం జరుగుతోంది, వారి మనోభావాలు దెబ్బతింటాయీ అనే జ్ఞానం లేకుండా ప్రతీదీ తమ మీడియాలో లైవ్ టెలికాస్టు చేసి మరీ సీమాంధ్రులని తిట్టించారు.... 

అదే సమయంలో కనుక కొంత సంయమనం పాటించి...
ఆ తిట్లని ప్రసారం చెయ్యకుండా ఉండినట్లైతే...
ఆ తిట్టే వారికి ప్రోత్సాహం తగ్గి...
తాము మాట్లాదేది తప్పు అనే విజ్ఞత అయినా కలిగేది కదా... 
పోతే పోతారు మాదేం పొయ్యింది అనే చందాన 
ఈ దిక్కుమాలిన మీడియాలు
 ఉద్యమ ప్రాంతంలో ఏ ఇద్దరు కూర్చొని ఏ కాస్త గొడవ చేసి తిట్టినా 
దానిని యధావిధిగా ఏ మాత్రం సెన్సార్ చెయ్యకుండా ప్రసారం చేసి
 సీమాంధ్రుల ప్రజలని ఎంతగా అవమానించారో అంతగా 
ఆత్మా విశ్వాసాన్ని దెబ్బతీశాయి...
పైగా వీళ్ళకి "సీమాంధ్ర మీడియా అనే పేరు"...

ఈ మీడియాలు ఎంత ఏకపక్షంగా వ్యవహరించాయి అంటే.. పొద్దున్నే పెద్ద "మనుషుల పేరంటాలలో" కూడా వారు కూర్చొని మాట్లాడేప్పుడు, అవతల వారిని ఏ మాత్రం కంట్రోల్ చెయ్యకపోగా, తాము కూడా ఒక చెయ్య వేశారు... ఈ పాపాన్ని ఏ ఒకటో రెండో చానళ్ళే కాదు...అనేక మురికి చానళ్ళు చేసినాయి... అప్పుడే వీరి మీద సీమాంధ్రలో దాడి చెయ్యవలసిందే...కానీ, అది జరగలేదు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని ఊరుకున్నారు.

ఉద్యమం అయిపోయింది....ఇప్పుడు కూడా అదే ధోరణిని అలాగే కొనసాగించారు ఒళ్ళు తెలియని మన మీడియా వారు...ఇన్నాళ్ళూ వీళ్ళ కొమ్ము కాశాముకదా... మనం ఏమన్నా చెల్లుబాటు అవుతుంది అని అనుకుని...అక్కడి ప్రాంతం వాళ్ళ మీద కారు కూతలు కూశారు. తిట్టే వారికి తిట్టించుకోవాలని ఉంటుందా...?? వారికి మనోభావాలు దెబ్బతిన్నాయి... అంతే మీడియాల్లో ఒకటి రెండిటిని మూటగట్టేశారు...అసలు ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన అన్నిటికీ మూటగట్టించుకునే అర్హతని కలిగి ఉన్నాయి.... కానీ, పాపం కేవలం రెండు చానళ్ళకే ఆ పాపము పండింది...

ఈ విధంగా రెండు చానళ్ళకి పాపం పండినాక, 
మిగిలిన చానళ్ళకి జ్ఞానోభయం కలిగింది. 
అంతే, 
అక్కడి నుండీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తున్నాయే కానీ, 
తమ సోదర చానళ్ళు ఈ విధంగా మూతపడ్దాయి...
వాటిని తెరిపించటానికి అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాము...
ఇది మీడియాకే/ప్ప్రజ్జాసామ్యానికే గ్గొడ్డల్లి పెట్టు...
"ఆ రెండు చానళ్ళు వచ్చే వరకూ 
మన చానళ్ళని కూడా ఆ ప్రాంతంలో బంద్ చేద్దామూ" 
అని గొడవ చెయ్యలేదు... 
"అలా గొడవచేసి, అన్ని చానళ్ళని ఆ ప్రాంతంలో రానియ్యకపోతే,
అక్కడి కేబుల్ ఆపరేటర్లకి నెలవారీ డబ్బులని జనం కట్టేవారు కాదు...
అప్పుడు వారు దిగి వచ్చే అవకాశం ఉన్నది కదా"...
కానీ, అలా చెయ్యలేదు...
బుద్ధిగా వారి మీడియా వ్యాపారాన్ని వారు చేసుకుని పోతున్నారు... 
చేసిన పాపం ఊరికే పోతుందా...పోదు. 
అయితే, 
ఆ పాపం మొత్తం కేవలం రెండు చానళ్ళ మీదే పడటమే బాధాకరం...!!!  



@@@@@@@@@@@@@@@@@
బొమ్మ గూగుల్ లోనిదే 




5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

విజయవాడే రాజధాని ఎలా అయ్యింది...???

జై తెలుగోడా.... తెలుగు వారికి సందేశంరామాయణ కాలంలో... దశరధుడికి పిల్లలు పుట్టకపోతే, యజ్ఞం చేసినప్పుడూ రెండు ఫలాలు వచ్చినాయట. ఆయనకి ఉన్నదేమో కౌసల్యా, కైకేయి, సుమిత్ర అనే ముగ్గురు భార్యలు...వచ్చిందేమో రెండే పళ్ళు... ఒకటి పెద్ద భార్యకూ, రెండవది రెండవ భార్యకూ ఇచ్చాడు...ఆ పుచ్చుకున్న ఇద్దరు భార్యలూ తమకిచ్చిన కాయలో సగాం తాము ఉంచుకొని, మిగిలినది సుమిత్రకి ఇచ్చారు... దానితో ఆవిడకి రెండు ముక్కలు... అనగా ఒక "పూర్తి ఫలం" దక్కింది...మిగిలిన ఇద్దరికీ ఒక్కొక్కరు పుడితే, మూడవ భార్యకు కవల పిల్లలు పుట్టారు...ఇదీ కధ...


సాక్షి పేపర్లో వేసిన ఈ ఫోటో చాలా బాగున్నది... 
పోయిన తెలంగాణా[హైదరాబాదు]ని 
విజయవాడ కవర్ చేస్తుందనే భావనని చూపించారు....[కర్టేసి:సాక్షి]


ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కర్నూలూ, విశాఖ, విజయవాడలు పోటీపడినాయి... వీటితోబాటూ మరికొన్ని కూడా పోటీపడినాయి అనుకోండి...అవి కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం... అందరిదీ ఒకటే మాట ... "తమ ఊరే రాజధానిగా చెయ్యాలి" అని,  దేనికవే పోటీపడినాయి కానీ... మరొక దానిని కలుపుకోవాలని  ఎవరూ అనుకోకపోయినా... అనుకోకుండానే అందరూ మానశికంగా విజయవాడనే కలిపేసుకున్నారు...


కర్టేసి:గూగుల్ మేప్ 

ఎలాగంటే...విశాఖలో పెట్టమన్న విశాఖ వాసులు రాజధాని అక్కడే పెట్టాలనీ...ఏ కర్నూలులోనో పెడితే చాలా దూరం అయిపొతుందని అన్నారు...అలాగే కర్నూలు వాళ్ళు కూడా తమకు రాజధాని హక్కు అనీ... మరెక్కడా పెట్టకూడదని చెపుతూనే... విశాఖలో పెడితే తమకి దూరం అవుతుందని కుండ బ్రద్దలుకొట్టి మరీ చెప్పారు... ఇదే కధ మిగిలిన అన్ని ఊళ్ళదీనూ...ఒక్క విజయవాడ తప్పిస్తే. విజయవాడ వాళ్ళే కాదు...దీనికి చుట్టూ ఉన్న ఊళ్ళ వాళ్ళే కాదు...చుట్టూ జిల్లాల వారు కూడా విజయవాడ కేపిటల్ అయితే తమకి మాత్రమే కాదు రాష్ట్రం మొత్తానికీ అందుబాటులో ఉంటుందనే భావననే ప్రచారం చేశారు... 

దీని ప్రకారం, ప్రతీ వాళ్ళూ తమ దగ్గరున్న మూడు నాలుగు ఓట్లలో 
మొదటిది తమ ఊరికి వేసుకొన్నా... 
రెండవ ఓటుని విజయవాడకే వేసేశారు...
విజయవాడ ఓట్లు విజయవాడకే పడగా... 
మిగిలిన అన్ని చోట్లా రెండవ ఓటు విజయవాడకే పడింది. 
దానితో నూతన ఆంధ్రప్రదేశ్‌నకు రాజధానిగా విజయవాడే ఎన్నికయ్యింది...

ఇదంతా బాగానే ఉన్నది... 
ఎవరికి వారు తమ ఊరు కాలేదని అనుకున్నా...
కనీసం దగ్గరలో/అందుబాటులో ఉన్న ఊరు అయ్యిందని సంతోషించారు...
కొంత అసంతృప్తిగా ఉన్నాప్పటికీ... 
అయితే, 
ఇలా జనం కొట్టుకోబోతే మాకేమిటి లాభం అనుకున్నారేమో మన టివీ వారు... 
రాజధాని ప్రకటన కన్నా, 
దాని మీద విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చారు...
ముఖ్యంగా టీవీ 9 మరియూ మరొక టీవీ వారు 
"తమని తెలంగాణాలో నిషేధించటం సరైన నిర్ణయమే" అని నిరూపించుకున్నారు,..
రాయలసీమలో/విశాఖలో నిరసనలు వెల్లువెత్తాయనీ...
విజయవాడలో హర్షం ప్రకటించారనే రెచ్చగొట్టే ధోరణిలోనే తమ న్యూసుని ఎగ్జిబిట్ చేశారు... 

మిగిలిన ప్రదేశాలలో ఏమోగానీ...విజయవాడలో ప్రత్యేకించి ఈ విషయం మీద శ్రద్ద పెట్టకపోగా...రాజధాని అయితే ఎన్ని బాధలు పడాలిరా దెవుడా అనే మాటే వినపడింది...ఇది కేవలం రాష్ట్రానికి సెంటర్లో ఉండటమే ఇక్కడి వారి నెత్తికొచ్చింది. కాబట్టి, రాజధాని సంతోషం ఇప్పటికే ఇక్కడ ఉన్నవారికి పెద్దగా లేదు. దానికి కారణం ... పెద్ద నగరంలో ఉండవలసిన సౌకర్యాలే కాదు, పల్లెటూళ్ళో ఉండే సౌకర్యాలు కూడా ఉండటం విజయవాడ విశేషం... అంటే ముంబాయి, ఢిల్లీ లాంటి నగరాలలో దొరికే అన్ని రకాల వస్తువులూ, సౌకర్యాలతోబాటూ, పల్లెల్లో అతి తక్కువ ధరల్లో దొరికే కూరలూ, మంచి పాలూ పెరుగూ ఇలా ఒకటేమిటీ అన్నీ చౌకగా దొరుకుతాయి.... అందుకనే విజయవాడలో ఎటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా కూడా, పూర్తి ఆంధ్రప్రదేశ్‌లో మూడవ పెద్ద నగరం అయినది. దీని పైనున్న రెండు పెద్ద నగరాలైన హైదరాబాదు, విశాఖలలో కూడా దొరకనంత చౌకగా ఇక్కడ అన్నీ దొరికేవి... దొరికేవి అని ఎందుకంటే... ఇప్పుడు రాజధాని రేసులో ఉన్నప్పుడే...పైన చెప్పుకున్న అనేక సౌకర్యాలూ ఒక్కొక్కటిగా కనుమరుగు అవుతూ వస్తున్నాయి... ఇక రాజధానిగా ప్రకటించటించగానే... మన పరిస్థితి ఏమిటా అని విజయవాడలో ఇప్పటికే ఉన్న పౌరుల బాధమొదలైయ్యింది...   


అప్పుడే అవ్వాలిసింది...

ఇక విమర్శల విషయానికొస్తే, 
విజయవాడని నిర్ణయించినది కుల రాజకీయమే అని...
అయితే, 1953లో జరిగింది కూడా అదే కదా...
విజయవాడలో రాజధానిని పెడితే అక్కడి ఒక కులం వారి వలన 
మన రాజకీయం సాగదు అనీ,
 [దానికి కమ్మ్యునిస్టుల రంగేసి]
తమ ప్రాబల్యం ఉన్న కర్నూలులోనే పెట్టారు... 
కానీ, ఇప్పుడు ఆ సీను రివర్సు అయ్యింది... 
 రాజధానిని నిర్ణయించేవారు తారుమారు అయ్యారు... 
ఫలితం కూడా తారుమారు అయ్యింది..
అంతేగానీ కొత్తగా జరిగిందేమీ లేదు.


ఇప్పుడు అయ్యింది....

రాజధానిని ప్రకటించేశారు...ప్రకటించిన వారికి రాష్ట్రంలోనే కాదు...దేశాన్ని నడిపే ఢిల్లీలోను ప్రాబల్యం ఉన్నది. కాబట్టి సభలో హుందాగా వ్యవహరిద్దాము... "ఇప్పుడు చూపించే దృశ్యాలని దశాబ్దాలపాటు చూస్తారు" అని అనుకోకుండా, సభలొ రాజధాని ప్రకటన సమయంలో ప్రతిపక్షం ఎంత గొడవ చెయ్యాలొ అంతా చేసిపారేసింది...ప్రతిపక్షం...గొడవ చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్న ధ్యాసేగానీ, ఫలానా చోట పెట్టాలి, అక్కడ ఎందుకు పెట్టాలి అనే విషయాలపై శ్రద్ద పెట్టలేదు... పైగా ప్రకటన అవ్వంగానే.... ఈ రాజధాని ప్రకటనని ఆహ్వానిస్తున్నామని...కేవలం తమకి చెప్పకుండా పెట్టకూడనే అభ్యంతరం చెప్పామని... "ఇంతగోడవ ప్రజల కోసం కాదు, కేవలం రాజకీయం కోసమే అన్న విధాన"...  ప్రతిపక్షం వారు తమ గొడవ వెనుక ఉన్న అంతరార్ధాన్ని వివరించేశారు...

ఇక అధికార పక్షం విషయానికొస్తే... మేము అన్ని విధాలా బలంగా ఉన్నాము ఒకరికి చెప్పేదేమున్నది...అన్న చందాన...ఆ పార్టీలోని మంత్రులే కాకుండా ఏం.ఎల్.ఏ.ల దగ్గర నుండి కార్యకర్తలుదాకా అందరూ అసలు విషయాన్ని నెల రోజుల నుండే పైకి చెప్పేశారేగానీ, ప్రకటన చేసే ముందర రోజు అయినా,  ప్రతిపక్ష నేతని పిలిచి "ఇదీ విషయం ... రేపు మేము ప్రకటన చేస్తున్నాము...మీ మద్దతు ఇవ్వండి" అని ఉంటే.. ప్రకటన చేసే టైములో ప్రశాంతంగా పద్దతిగా ఉండి...ఆ దృశ్యాన్ని మళ్ళి మళ్ళి చూసే వారికి ఎటువంటి బాధ కలగాకుండా ఉండేది కదా...!!!

పెళ్ళిలో గొడవ జరిగితే, తరతరాలుగా గుర్తు ఉంచుకొని, ఆ కుటుంబంలో గొడవలకి అది మూలం ఎలా అవుతుందో ... అలాగే, ఈ గొడవ ప్రభావం మన రాష్ట్ర భవితవ్యంపై ఉండకుండా...మళ్ళీ మళ్ళీ కెలుక్కోకుండా...ఇకనైనా అధికార ప్రతిపక్షాలు తాము సంయమనంగా ఉండి...ప్రజల మధ్య సంయమనం ఉండేట్లుగా చేస్తే, మన ఆంధ్రప్రదేశ్ త్వరలోనే అభివృద్ధి చెందుతుంది. 




@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@


ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి






@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@


ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???

25] సొమ్ము సీమాద్రులది...సోకు తెలుగుదేశం పార్టీకి...!!!

26] ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీది ప్రతిపక్ష పాత్రా....???ం పార్టీకి...!!!
27] దేశ సంఘ సేవకులకి అమరావతి మీదున్న ప్రేమ ధిల్లి మీద లేకపోయే....




@@@@@@@@@@@@











   

 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@











   

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఆంధ్రా రాజధానిలో "సాంబారు భూకంప రాజకీయం"..???

రాజధానికోసం కమిటీని వేశారు బాగానే ఉన్నది... దానిలో ఒక్కరూ తెలుగు వారు లేరు "ఇది మరీ బాగుంది...!!!" కమిటీ రాష్ట్రంలో పర్యటించి ఒక రిపొర్టు కూడా ఇచ్చింది... మరీ మరీ బాగా ఉన్నది...  అయితే, ఆ రిపొర్టులో అక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే అక్కడి నీటి లభ్యత 20 ఏళ్ళపాటు లెక్కలోనికి తీసుకోవాలి అని అనటంతోబాటు... ఫలానా చోట పెడితే ఎండ బాగుంటుంది....మరో చోట భూకంపాలు వస్తాయి, ఇంకొక చోట నీళ్ళు దొరకవు అనేవి కూడా బ్రహ్మాణ్ణంగా వివరించేశారు... అయితే, దీనిలో ఉప్పులేని సాంబారు రాజకీయం కనపడుతోంది...!!!

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
జోన్ 4 లో ఢిల్లీ,  ముంబాయ్, కలకత్తాలు[పార్ట్] ఉన్నాయి,
జోన్ 3లో చెన్నయ్,కలకత్తాలతోబాటు విజయవాడ ఉన్నది.
భయంకరమైన భూకంపం వచ్చిన లాతూరు... జోన్ లో 2 లో ఉన్నది...
విచారకరమైన విషయం ఏమంటే హైదరాబాదు కూడా జోన్ 2 లోనే ఉన్నది...
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎందుకంటే, రాజధానిని పెట్టేప్పుడు ఎండలెక్కువా, భూకంపాలున్నాయా, నీళ్ళుంటాయా అనికాదు చూసేది... ఈ పైన చెప్పిన మూడు దుర్లక్షణాలు హైదరాబాదులోనూ, మరియూ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉన్నాయి... ఒక్క సునామీ వస్తే క్షణాలలో లక్షలలో ప్రాణాలు, వేల కోట్ల రూపాయల పరిశ్రమలు నీటిలో కలిసి పోయే సునామి జోన్‌లో ఉన్నాయి చెన్నయి, ముంబాయిలు. ఎండలు ఎక్కడ లేవు...ఢిల్లీలో మండే ఎండతోబాటు రాజస్తాన్ ఇసుక వానకూడా వస్తుంది... అయినా, వీరు చెప్పిన విజయవాడ[విజిటి] పరిధిలో గత 100 ఏళ్ల పైన ప్రాణాంతక భూకంపాలు వచ్చిన చరిత్ర లేదు....


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇందులో కూడా విజయవాడ-చెన్నయిలు జోన్ ౩ మోడరేట్ లో ఉన్నాయి.
ఢిల్లి,ముంబై,కొలకత్తాలు జోన్ 4 హై రిస్క్ లో ఉన్నాయి.
లాతూర్, హైద్రాబాదులు జోన్ 2 లీస్టు అక్టివ్‌లో ఉన్నాయి.
లీస్టు అక్టివ్‌లో ఉన్న 
10 వేలమంది ప్రాణాలు పొయ్యాయి, 30 వేలమంది గాయపడ్డారు, బోలెడు ఆస్తి నష్టం జరిగింది.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

విజయవాడ ప్రాంతంలో పెట్టటం ఇష్టం లేకపోతే 
సరైన కారణం చెప్పాలే కానీ
వందల సంవత్సరాలుగా జరగని ఉపద్రవాన్ని 
ఆ ప్రాంతం మీద ఆపాదించటం ఎంతవరకు సరైనది...???  
"ఈ ప్రాంతంలో గత రెండు మూడు వందల సంవత్సరాలుగా 
ఎన్ని భూకంపాలు వచ్చినాయి...?
వాటి వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది...
ఎంత ఆస్థి నష్టం జరిగింది...
లాంటి వివరాలని ఆయన తన రిపోర్టులో ఇచ్చుంటే బాగుండేది"...
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------

విజయవాడకి దగ్గరలో రాని భూకంపాలు... కర్టేసి:http://earthquaketrack.com/
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈయనగారు చెప్పిన వినుకొండ-దొనకొండ-అద్దంకి ప్రాంతాలలో 
నెలకోకసారైనా భూమి కంపిస్తుంది...
ఈ సంగతి అక్కడి ప్రజలకి తెలుసు...వీరు పెద్దగా కంగారు కూడా పడరు. 
ఇలాంటి ప్రదేశాన్ని ఎందుకు సేఫ్ జోన్ అన్నారో ఆయనకే తెలియాలి. 
అయితే, ఇందులో రాజకీయం ఏమంటే...
విభజన తరవాత విజయవాడ ప్రాంతం
తప్పనిసరిగా అభివృద్ధి చెందే ప్రాంతం...
"రాజధాని అయినా కాకపోయినా",
ఆ అభివృద్ధి ఫలితం
చెన్నయి మీద చెడుగా పడుతుందనే
అరవ భయం అయ్యుంటుంది...
అందువల్లనే
బయటివారి పెట్టుబడులు వచ్చే...
త్వరగా అభివృద్ధి చెందే 
విజయవాడ ప్రాంతంపై అనవసర రాద్దాంతం చెయ్యటం....

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
గత 200 సంవత్సరాలుగా భారతదేశంలో వచ్చిన భూకంపాలు 
33TE
EPICENTER

Lat(Deg N)      Long(Deg E)
LOCATION
MAGNITUDE
1819 June 16
  23.6                    68.6
KUTCH, GUJARAT
8.0 
1869 JAN 10
  25                        93
NEAR CACHAR, ASSAM
7.5
1885 MAY 30
  34.1                    74.6
SOPOR, J&K
7.0
1897 JUN 12
  26                        91
SHILLONG PLATEAU
8.7
1905 APR 04
  32.3                    76.3
KANGRA, H.P
8.0
1918 JUL 08
  24.5                    91.0
SRIMANGAL, ASSAM
7.6
1930 JUL 02
  25.8                    90.2
DHUBRI, ASSAM
7.1
1934 JAN 15
  26.6                    86.8
BIHAR-NEPAL BORDER
8.3
1941 JUN 26
  12.4                    92.5
ANDAMAN ISLANDS
8.1
1943 OCT 23
  26.8                    94.0
ASSAM
7.4
1950 AUG 15
  28.5                    96.7
ARUNACHAL PRADESH-CHINA BORDER
8.5
1956 JUL 21
  23.3                    70.0
ANJAR, GUJARAT
7.0
1967 DEC 10
  17.37                    73.75
KOYNA, MAHARASHTRA
6.5
1975 JAN 19
  32.38                    78.49
KINNAUR, HP
6.2
1988 AUG 06
  25.13                    95.15
MANIPUR-MYANMAR BORDER
6.6
1988 AUG 21
  26.72                    86.63
BIHAR-NEPAL BORDER
6.4
1991 OCT 20
  30.75                    78.86
UTTARKASHI, UP HILLS
6.6
1993 SEP 30
  18.07                    76.62
LATUR-OSMANABAD, MAHARASHTRA
6.3
1997 MAY 22
  23.08                    80.06
JABALPUR,MP
6.0
1999 MAR 29
  30.41                    79.42
CHAMOLI DIST, UP
6.8

భారత్‌లో వచ్చిన భూకంపాల లిస్టు. కర్టేసి:http://theconstructor.org/[లింకు నొక్కండి] ఇంట్లో కూర్చుని కాసేపు గూగుల్ దేవతని ఆరాధిస్తేనే ఇన్ని విషయాలు తెలిసినాయి.  మన రాజధాని కమిటిన్ వారు "ఎక్కడెక్కడ" తిరిగారో మరి....!!! దక్షిణాన గత 195 సంవత్సరాలలో  భూకంపం రాలేదు. అయితే, 1900లో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వచ్చినా పెద్దగా నష్టం జరగలేదు... దగ్గరగా మహారాష్ట్రాలో మాత్రమే రెండు సార్లు వచ్చింది. 
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఇక మీడియా వారి సంగతి చెప్పనే అఖర్లేదు... ఆయన చెప్పాడు... మేము వ్రాస్తాము అన్న చందాన..నిజానిజాలు తెలుసుకోకుండానే తమ న్యూస్ పేపర్ల నిండా "భూకంపాల జోను" అంటూ ఒకటే ఊదర కొట్టేస్తున్నారు...కాస్త బుద్ధితో ఆలోచిస్తే ఇట్టే తెలిసిపోతుంది కదా...అదేక్కోడో మెక్సికోలో కాదు కదా...ఇక్కడ ఉండే విజయవాడే కదా... "విజయవాడ పరిసర ప్రాంతాల చరిత్రలో ప్పుడైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించే భూకంపం వచ్చిందా"అని ఒక సారి చూసుకుంటే సరిపోతుంది కదా... కానీ చూసుకోరు...మనకి కావాలిసింది సెన్సేషనల్ న్యూస్ అంతే. మనకి వేరెవరో శత్రువులు అఖర్లేదు... మన మీడియానే పెద్ద విచ్చిన్న కారి శత్రువు... ఒకప్పుడు విభజనకి ఆజ్యం పోశారు... మరిప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ మీద ఎవరో ఎదో చెప్పాడని క్రిందా మీదా చూసుకోకుండా ఒకటే రభస....

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------

అండమాన్/నికోబార్ ప్రాంతం... ఇది భయంకరమైన భూకంపాల జోన్...
పైగా ఇక్కడ రెండు అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి... 
ఇక్కడ వచ్చే భూకంపాల వలన వచ్చే సునామీ ఎఫ్ఫెక్టు చెన్నయ్ మీద ఉంటుంది...
దానికి ఉదాహరణ 2004లో వచ్చిన సునామినే...
దీనికి వెనుకాల ఉన్న మలేషియాలో వస్తేనే అది చెన్నయ్ వరకూ వచ్చింది.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్నో మనకి చెప్పినాయన రాష్ట్ర రాజధాని  చెన్నై... సునామి వస్తే మునిగిపోతుంది. అది 10 ఏళ్ళ క్రిందట వచ్చి ఆస్తి ప్రాణ నష్టం కలిగించింది కూడా...మరి ఈ 10 ఏళ్ళలొ వారు తమ రాజధానిని మార్చుకున్నారా ... లేదు...చెన్నయికి ఆంద్రా వాళ్లు తెలుగు గంగ ఇస్తేనే నీళ్ళు, ఇక ఎండలూ చెమటల గురించి చెప్పాలిసిన పని లేదు...వర్షం వస్తే మునిగిపోయే రోడ్లే ఎక్కువ...రాష్ట్రానికి మధ్యలో ఉన్నదా...అదీలేదు. ఇంతకీ అసలు భయం... రాజధానిని ఏ మధ్యలో ఉన్న పాత తమిళ రాజధానులు అయిన మదురైకో, తిరుచినాపల్లికో మారిస్తే ...చెన్నయిలో తిరిగి తెలుగువారి ప్రాభవం వస్తుందని భయం...ఇది పైకి చెప్పలేరు కదా...!!! మరి ఇప్పటి భయం...

విజయవాడ భూకంపాల జోనులో ఉన్నదో లేదో తెలియదుగానీ, 
"విజయవాడ కంపం" పరిధిలో 
చెన్నయి మడుకూ ఉన్నది అని... వాళ్లకి తెలుసు... 
విజయవాడ అభివృద్ధి చెందితే మొదట దెబ్బ తినేది చెన్నైయ్యే.

సరే, విషయానికి వస్తే... ఇన్ని చెప్పిన కమిటిన్ వారు...రాజధానికి కావాలిసిన అసలైన అర్హతని మరచినట్లున్నారు ....!!! ఇప్పటికే రెండు సార్లు తరిమెయ్యబడ్డ వారికి మొదలు తీసుకోవలిసిన జాగ్రత్త ఏది...??? నిజానికి ఏదైతే ముఖ్యమైన విషయం ఉన్నదో దానిని పరిగణలోనికి తీసుకోలేదు... "ఎక్కడ పెడితే హైద్రాబాదు తరహాలో మిగిలిన జనాన్ని తరిమెయ్యకుండా ఉంటారో" అది మడుకూ చెప్పలేదు... కమిటిన్ వారు చెప్పినదానిలో మరొక విష[య]౦ ఉన్నది...తమ రిపోర్టులో శ్రీకాళహస్తి మీద ఎనలేని ప్రేమ చూపించారు...ఇదేదో చిత్తూరు జిల్లామీద ప్రేమ కాదు. ఎందుకో తెలుసా...అది తమిళనాడుకి కూత వేటు దూరంలో ఉన్నది...అక్కడేదో సైన్సు సిటితోబాటు...ఇప్పటికే కొట్టుకుంటున్నవిజయవాడ, గుంతకల్, విశాఖలు కాకుండా శ్రీకాళహస్తిలో రైల్వే జోను పెట్టాలిట...!!!

నిజానికి, హైదరాబాదుని రాజధానిగా చేసేప్పుడు శివరామ కృష్ణన్ కమిటివారు చెప్పిన విషయాలులాంటివి చాలానే ఆలోచించారు... పెద్ద ప్రదేశం ఉన్నది... బోలెడు భవనాలున్నాయి...మరిన్ని కట్టటానికి కావాలిసినంత ఖాళీ ప్రదేశాలున్నాయి... దీని చుట్టూ వ్యవసాయ భూములు లేవు... నగరం కావాలిసినంత విస్తరించుకోవచ్చు అన్నీ ఉన్నాయి కానీ... ఏమి లాభం...తీసుకోవలిసిన అసలైన జాగ్రత్త తీసుకోకుండా కేవలం భౌతికమైనవిషయాలని పరిగణలోనికి తీసుకున్నారు...అది నిజాం క్రూరంగా పాలిచిన ప్రాంతం, అక్కడ బయటి వారికి సరైన భద్రత లేదు...అక్కడి సంస్కృతి సీమాంధ్ర జిల్లాల సంస్కృతికి చాలా భిన్నంగా ఉంటుంది లాంటి ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించలేదు. కేవలం భౌతికమైన విషయాల పట్లే శ్రద్ధ చూపించారు. అందువల్లనే అక్కడి నుండీ మూటా ముల్లే సర్దుకోవాలిసిన దుర్గతి సీమాంధ్రులకి పట్టింది... 

పై ముఖ్యమైన విషయాలని దృష్టిలో ఉంచుకొని కమిటి వారు ఇవి చూసారా...

అ] ఎక్కడ రాజధాని పెడితే ఆ ప్రజలు మిగిలిన వారి శ్రమని దోచుకొని తరవాత తరిమెయ్యకుండా ఉంటారు...

ఆ] ఎక్కడ పెట్టబోతున్నారో అక్కడ ఇప్పటికే ప్రాంతీయ ఉద్యమాలు ఉన్నాయా...

ఇ] ఎక్కడ పెట్టబోతున్నారో అక్కడి ప్రజలు మిగిలిన వారిని ఆదరించే స్థితిలో ఉన్నారా...

ఈ]ఎక్కడ పెడితే మరో మదరాసు, మరొక విధ్వంసక హైదరాబాదు కాకుండా ఉంటుందో 
ఈ కమిటి సూచించిందా...???

ఉ] ఎక్కడ పెట్టబోతున్నారో అక్కడ ప్రజలకి సామాజిక భద్రత ఉన్నదా... 

ఊ] రాజధానిని పెట్టబొయ్యే ప్రదేశంలో ప్రకృతి విలయాలు చూశారు, 
మరి చూడవలసిన మానవ హృదయాన్ని చూసారా... చూడలేదు...                  

ఖాళీ ప్రదేశాలు దొరకటం లేక భూకంపాల జొన్ అవటం లేక 20 యేళ్ళో 30 ఏళ్ళో నీటి లభ్యత స్థలాల లభ్యతా కాదు. చూడాలిసింది ఎప్పటికీ పెట్టే బేడా సర్దుకొని పోకుండా ఉండాలిసిన సామాజిక వాతావరణం ఉన్న ప్రదేశం... ఇటువంటి మానశిక  విషయాలని కూడా ఇదే బ్లాగులో [లింకు నొక్కండి] "సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టకూడదు... ?!?!?లో 24 ఫిబ్రవరి 2014న వివరించటం జరిగింది.


కమిటి రిపోర్టు విషయానికి వస్తే కూరంతా వండేసి దానిలో ఉప్పెయ్యటం మరిచిపోయినట్లున్నది... పోనీ ఇదేమన్నా అనుభవంలోనికి రాని విషయమా... కాదు కదా రెండు సార్లు మోసపోయిన జాతికి రాజధానిని వెదికేప్పుడు తీసుకోవలిసిన ముఖ్యమైన విషయాన్ని పరిగణలోనికి తీసుకోలేదు...ఇది మన రాష్ట్ర విషయంలో ఏమిటి... మన దేశ విషయంలోనే ఇటువంటి జాగ్రత్త తీసుకోలేదు... అదేమిటంటే... విదేశీయుల వలన వందల సంవత్సరాలు బాధపడి తరవాత స్వాతంత్రాన్ని తెచ్చుకొని, అప్పుడు వ్రాసిన రాజ్యాంగంలోనే "విదేశీయులు భారత దేశంలో ఎటువంటి రాజకీయ పదవులు/అధికారాన్ని పొంద కూడదు" అని ఎక్కడా వ్రాయబడలేదు...ఎన్నో బాధలు విదేశీయులచే/దురాక్రమణదారులచే పడిన తరవాత, స్వంతంగా  వ్రాసుకొన్న రాజ్యాంగంలోనే ఆ విషయాన్ని పొందుపరచలేదు...

సరే సంగతికొస్తే...
రాజధానికి కావాలిసిన ముఖ్యమైన విషయాలు... 

1] అందరికీ అందుబాటులో ఉండటం 

2] అక్కడ అప్పటికే విభజన వాదాలు ఉద్యమాలు లేకుండా ఉండటం

3] రాజధాని పెట్టబోయె ప్రాంతంలో 13జిల్లాలలో ఎక్కువ జిల్లాల సంస్కృతి కనపడుతూ ఉండటం.  

4] రాజధాని పెట్టబోయే ప్రదేశంలోని ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారా 
లాంటి ముఖ్యమైన విషయాలని కూడా పరిగణలోనికి తీసుకు తీరాలిసి ఉన్నది... 

5] రాజధాని ప్రదేశంలో ప్రకృతి భద్రతా కన్నా సమాజ భద్రతా ఉండటం ముఖ్యమైనది.

ఇలాంటి విషయాలని చూడాలే కానీ, లేనిపోని విష[0]యాన్నిపెట్టి రాజధాని అయినా కాకపోయినా అభివృద్ధి చెందబోయే  ప్రాంతం పై అనవసర అభాండాలు వెయ్యకూడదు...ఇలా లేనిది ఉన్నట్లుగా చెప్పటంతో...రాజధాని వికేంద్రికరణ  అనే ముఖ్యమైన విషయాన్ని కూడా నమ్మని పరిస్థితికి తెచ్చారు మన కమిటి వారు...అందుకనే మన విషయాలని  మనమే చూసుకోవాలేగాని, ఇతరుల మీద...అందులో ఒకప్పుడు మనని అవమానించిన వారిని, అరవ చరిత్రలో ఎప్పుడూ రాజధానిగా లేని మన చంద్రగిరి రాజులు నిర్మించిన పట్టణాన్ని లాక్కున్న వారిని నమ్మటం సరైనది కాదు...



@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@



రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???



@@@@@@@@@@@@