LOCAL WEATHER

7, మార్చి 2014, శుక్రవారం

సీమాంధ్రకు ముంచుకొస్తున్న అసలైన కష్టం...


ఈ కష్టం...  "సమైక్యం పేరుతొ అనైక్యంగా యుద్ధం చేసిన సీమాంధ్ర రాజకీయ నాయకుల వల్లన వచ్చేదే..."  రాష్ట్రం విడిపోవటం కన్నా మించిన కష్టం ఏమిటా అనా.... ఎదో ఒకటి రాష్ట్రం విడిపోయింది...దాని వల్లన సీమాంధ్రకి వచ్చిన పెద్ద కష్టం ఏమీ లేదు... నష్టం పూడ్చుకోదగినదే.... అయితే ఆ పూడ్చుకునే నష్టాన్ని పూడ్చేదేవారు...?? మళ్ళీ మన స్వార్ధ రాజకీయ నాయకులే కదా...వీరు ఎంత పనికిమాలినవారు అయినప్పటికీ...!!!   వీరి అనై[తికత్వం]క్యం వలన రాష్టం విడిపోయినా కూడా వీరికి బుద్ధి రాలేదు... కలిసికట్టుగా ఉండవలసిన సమయంలో ఎవరి పొయ్య వారు పెట్టుకొంటున్నారు...

ఇలా సీమాంధ్ర రాజకీయ'వేత్తలు ఉంటే..... అక్కడ తెలంగాణలో ఏక పార్టీ లేక ఏక నాయకత్వ పరిపాలన రాబోతోంది...తెలంగాణాని తెప్పించింది మేమంటే మేము అని ఎంతమంది చంకలు గుద్దుకున్నా... "ఆ క్రెడిట్ కేసీఆర్‌కి తప్ప మిగిలిన ఎవ్వరికీ పోదు"... పైగా తన ప్రాంతం కోసం  తన పార్టీని కాలుష్య సముద్రంలొ కలిపేయకుండానే ఉంచారు...ఇది తెలంగాణాకి ఎంతో మంచిది. ఇక కాంగ్రెస్సుకి... కేసీఆర్ అండలేకపోతేగానీ బ్రతకలేని పరిస్థితిని ఆ పార్టీ వారే కొని తెచ్చుకున్నారు.... ఇకపోతే ఇక్కడ బీజేపీది "దారిని పొయ్యే దానయ్య పరిస్థితే"... ఆస్తుల తగాదా పడుతున్నవారికి, ఓ దారిన పొయ్యే దానయ్య ఎంత సహాయం చేసినా కూడా... ఆ అస్తులలో వాడికి భాగం రాదు కదా...!!! ఇదే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి...

సీమాంధ్ర అని చెప్పి, తెలంగాణా పరిణామాలని వ్రాస్తున్నాననా మీ సందేహం...   విడిపోయి అన్నదమ్ములు లాగా బ్రతుకుదాము అన్న వారు,  అప్పుడే పంపు తగాదాలూ...ప్రహరీ గోడ తగాదాలూ మొదలెట్టేశారు.  ఈ కాస్తకి... ఇచ్చి పుచ్చుకుందాం అని కూడా ఓర్వలేని వారు... అన్నదమ్ములులాగా ఎలా ఉంటారు...కేవలం బద్ద విరోధులు లాగానే బ్రతుకుతారు... రేపు సీమాంధ్ర వారికి వీరితోనే తప్పనిసరిగా కలిసి కాపురం చెయ్యవలసిన పరిస్థితి కాబట్టి... అక్కడి రాజకియ పరిస్తితి బట్టే సీమాంధ్రలోని అభివృద్ధి ఆధారపడి ఉంటుంది... ఎవరైనా విడాకులు తీసుకోవాలని అనుకున్నా... ఒక పరిస్థితిలో కనీసం ఒక సంవత్సరం కలిసి ఉండి...అప్పుడు తీసుకోమని అంటుంటారు... కానీ, సీమాంధ్రులు విడాకులు తీసుకొన్న తరవాత కూడా తప్పనిసరిగా 10 ఏళ్ళు కలిసి బ్రతకమని, బ్రిటీషు తెలివితేటలున్న రాజకీయ నాయకులు పెట్టేశారు. అందుకనే సీమాంధ్రకు తెలంగాణా రాజకీయం కావాలి... అలాగే తెలంగాణాకి సీమాంధ్ర రాజకీయం కావాలి...ఇరువైపులా సమర్ధ ఐకమత్య రాజకీయ  నాయకత్వం ఉన్నప్పుడే ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరుగదు...అదిగాని బాలెన్సు తప్పిందో...అంతే సంగతులు...

తెలంగాణాలో ఏకపార్టీ పరిపాలన రాబోతుండగా...సీమాంధ్రలో ఐకమత్యం  మరియూ  నీతి జాతి లేని రాజకీయ నాయకులు...కనీసం ద్వి పార్టీ కాకుండా కూడా చేసేశారు... ఎవరి దారి వారిదే.. ఎవరికి వారికి తమ రాజకీయ భవితవ్యం మీద ఆందోళనేగానీ... విడిపోయి, రాజధాని లేక అల్లల్లాడుతున్న సీమాంధ్ర గురించి ఎవరికీ పట్టటంలేదు... ఇలా కొట్టుకు చచ్చే పార్టీలు అనేకం ఉండటంతో సీమాంధ్రలో ఏ సంకీర్ణమో కనుక వస్తే... సీమాంధ్రకి తీరని నష్టం వస్తుంది...వీరి అనైకత్యంతో ... మళ్ళి ఐకమత్యంగా హైదరాబాదునే అభివృద్ధి చేస్తారు...వీరు ఇప్పటికీ సీమాంధ్ర అవసరాలు...కరెంటు తదితరాల పట్ల ఉదాసినంగా ఉండటానికి కారణం...హైదరాబాదులో ఉన్న వారి ఆస్తులు...పరిశ్రమలే....

ఇక విషయంలోనికి వస్తే, కొత్తగా విడిపోయిన తెలంగాణాలో బలమైన ఏకపార్టీ పరిపాలనతో వారు తమకి కావాలిసినవన్నీ సమకూర్చుకుంటారు...ఇది ఎన్నికల తరవాతే చెప్పనఖర్లేదు...ఇప్పటికే భద్రాచలం విషయంలో తేటతెల్లం అయ్యింది... తమది కాని భధ్రాచలాన్ని వీరు సాధించుకుంటుంటే... ఇప్పటికి కూడా తమ గొడవలే కానీ...తిరిగి ఆ పట్టణాన్ని అడుగుదాము...అక్కడి ప్రజలని ఆకట్టుకుందామన్న జ్ఞానం లేని రాజకియ నాయకులతో సీమాంధ్ర నిండి ఉన్నది...కేవలం ఒక్క పట్టణాన్ని కూడా సాధించుకోలేని... ఇలాంటి అసమర్ధ-స్వార్ధ-పనికిమాలిన నాయకులతో సీమాంధ్ర ఉన్నది...ఇది రాబోయే అయిదేళ్ళ పాలనలో కూడా కనపడుతుంది... సీమాంధ్రకి భవిష్యత్తు పునాదికి కావాలిసింది కూడా రాబోయ్యే అయిదేళ్ళ పాలనే... ఆ అయిదేళ్ళ పాలన కూడా సీమాంధ్ర మూర్ఖ-స్వార్ధ పాలకులతోనే గడచిపోతే,  ఇక సీమాంధ్ర కోలుకోవటం ఇప్పట్లో సాధ్యపడదు...

కాబట్టి, సీమాంధ్ర రాజకీయ నాయకులారా... 
ఇప్పటికైనా ఇక్కడి అన్ని పార్టీలు కలసి 
సీమాంధ్రకి కావాలిసినవి సాధించేట్లుగా 
ఒక కూటమిగా ఏర్పడి...
ఒకరినొకరు తిట్టుకోవటం మాని...
ఏక నాయకత్వం క్రిందకి తప్పనిసరిగా వచ్చేట్లుగా నిర్ణయం తిసుకోండి... 
మీ స్వార్ధ రాజకీయ భవిష్యత్తుని గురించి ఆలోచించటం మానండి... 
సీమాంధ్రుల కష్టం తిరిగి ఏ మదరాసులోనో, హైదరాబాదులోనో
 లేక ఏ మురికి గుంటలోనో పడిపోకుండా 
చూసుకొనే విధంగా రాజకీయాలు నడిపి, 
సీమాంధ్ర ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించండీ... 
సీమాంధ్రులకి కావాలిసింది డబ్బులో లేక పేకేజీలో కావు... 
వీరికి అవ్వి సంపాయించే తెలివితేటలు చదువూ అన్నీ ఉన్నాయి... 
లేనిదల్లా ఆత్మ విశ్వాసమే... 
దానిని పొగొట్టింది కూడా మీరే...

ఇకపోతే హైదరాబాదు మీడియా...
సీమాంధ్రుల ఆత్మవిశ్వాసం పోగొట్టటంలో ప్రముఖ పాత్రని పోషించింది...
కాబట్టి,
 సీమాంధ్ర బాగుపడాలంటే 
హైదరాబాదులో ఏ గూడాలోనో కురిసిన భారి వర్షాన్ని 
రాష్ట్ర వ్యాప్తంగా  లైవ్ చేసే 
భావిలో కప్పలైన హైదరాబాదు మీడియా కాదు...
"స్వంతంగా సీమాంధ్ర ప్రాంతంలో నుండీ వచ్చే సీమాంధ్ర మీడియా కావాలి"...
ఈ మీడియా మాత్రమే 
సీమాంధ్రుల మనోభావాలని ప్రతిబింబించి, వాటికి గౌరవం పెంచుతుంది...
ఇది ఖచ్చితంగా జరగాలిసినదే...
ఎందుకంటే,
ట్రాయ్ కధలో గుర్రం బొమ్మతో గ్రీకు వారు మోసం చేసినట్లుగా...
 తమ వార్తలు, డైలీ సిరియల్సుతో
దిక్కుమాలిన హైదరాబాదు మీడియాలు
సీమాంధ్రులను మోసం చేస్తున్నాయి...చేస్తాయి.

సీమాంధ్ర ప్రజలూ తస్మాత్ జాగ్రత్త...!!!
"పొత్తులు అంటూ రాజకీయ వెర్రిని, 
 డైలీ సీరియల్స్, రియాలిటి షోలు అంటూ సుత్తులని కొట్టే "
హైదరాబాదు పిచ్చి మీడియాని వదిలించుకోండి...!!!



జై హింద్




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి