LOCAL WEATHER

28, జులై 2013, ఆదివారం

భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!

ఇప్పటి దాకా భారతదేశ  అన్నీ విచ్చిన్నాలకి కారణం కాంగ్రెస్సే అని చెప్పవచ్చును. ఎక్కడ కాంగ్రెస్సు అధికారం లేదో అక్కడే వేర్పాటు వాదాలు వస్తాయి. కుదిరినంతవరకు విడగొట్టి అధికారం చేజిక్కించుకోటానికే అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తుంది. కుదరకపోతే లోకల్ గా ఉన్న ఉద్యమాలను రెచ్చగొట్టి చలి కాచుకుంటుంది. అలా కాకుండా ఈ లోగానే అక్కడ అధికారం వస్తే ఆ ఉద్యమాలని విభజనలని మర్చిపోయినట్లుగా ఉంటుంది. వీలయితే ఆ ఉద్యమాల మీద కడివెడు నీళ్ళు పోస్తుంది. మరల అధికారం పోగానే పోగాలం దాపరిస్తుంది. ఇదేదో ఆ పార్టి మిద కోపంతో వ్రాసినది కాదు. స్వాతంత్రం వచ్చిన తరవాత భారతదేశ రాష్ట్రాల విభజన జరిగిన విధానం చూస్తే మనకే  తెలుస్తుంది.

1]ముందరగా దక్షిణ దేశ విభజన......అవిచ్చిన్న మదరాసు రాష్ట్రంలో ఎప్పుడైతే ద్రవిడుల ఉద్యమాలు పుట్టబోతున్నాయో  అప్పుడే ఆ రాష్ట్రం విచ్చిన్నం అయిపోయింది. ఒక్క రాష్ట్రం నాలుగు ముక్కలు అయిన తరవాత కేవలం ఒక్క రాష్ట్రంలోనే ద్రవిడులు పాగా వెయ్యగలిగారు.  ద్రవిడులు పాతుకున్నచోట కనీసం వేలుకూడా పెట్టలేని స్థితి ఇప్పుడు ఉన్నది. ఈ స్థితిని ముందరే ఊహించిన కాంగ్రెస్సును అభినందించలేకుండా ఉండలేము.

పనిలో పనిగా ఆ కాలంలోనే అనేక రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆ విభజనల ద్వారా కాంగ్రెస్సు పటిష్టమైన పునాది ఏర్పాటుచేసుకున్నది. పాపం చాలామంది అవి "భాషాయుక్త రాష్ట్రాలని" భావించారు. కానీ, అవి "కాంగ్రెస్సు[కుట్ర]యుక్త" రాష్ట్రాలని తెలిసుకోలేకపోయ్యారు. అలా వీరు మేనేజ్ చెయ్యగలిగారు. అప్పట్లో ఇప్పటి అంత విచ్చల విడిగా ఉండే మీడియా లేదు కదా....చీల్చి చెండాలటానికి........

పైన జరిగిన దానికి ఋజువులు ఏవున్నాయి.....  ఆ విభజన జరిగిన తరవాత అక్కడ కాంగ్రెస్సు బలంగా పాతుకుపోవటమే..... అదే కాకుండా......ఇప్పటి కాంగ్రెస్సు నీతిని కూడా కలిపి చూస్తె ఇట్టే  తేట తెల్లం అవుతుంది.

2]ఇక ఉత్తరదేశంలో చూస్తే, కాంగ్రెస్సుకు బలమైన కోట ఉత్తరప్రదేశ్ లో ఇతర పార్టీలు అయిన బిజెపి, బిఎస్పి, ఎస్పీలు పాతుకుపోవటం, కాంగ్రెస్సుకి దిక్కే లేకపోవటం జరిగింది. అందులో నుండి ఉత్తరాఖండ్ పుట్టింది...ఈ ఖండులో కాంగ్రెస్సు బిజెపికి మంచి పోటిని ఇవ్వటమే కాకుండా అధికారాన్ని కూడా చేజిక్కించుకునే పరిస్తితిలోనే ఉన్నది.  చేజిక్కించుకున్నది కూడా........

3] ఇక బీహారులో సంగతి తెలిసిందే.....అక్కడ కాంగ్రెస్సుకి   ఎంత బలమైన వేళ్ళున్నప్పటికి..వాటిని తెగ్గోట్టుకొని బిజెపి, ఆర్జెడిలు వచ్చినాయి. అంతే, దక్షిణ బీహారు...ఝార్ఖండ్ తెగిపడింది.  కానీ, అంత మంచి ఫలితాలని ఇప్పటికైతే కాంగ్రెస్సు సాధించలేదు కానీ, భవిష్యత్తులో కాంగ్రెస్సుకే  లాభం. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్సు ప్రతి పక్షాలు ఒకటికి రెండు, మూడు  పార్టీలుగా చీలిపోయ్యాయి. ఇవ్వాళా కాకపొతే రేపు. భవిష్యత్తు అధికారం మిద నమ్మకం ఉన్న పార్టి కదా....

4]మధ్యప్రదేశ్...ఇక్కడ కూడా బిజేపినే కాంగ్రెస్సు కి  శత్రువు అయ్యింది.....దానితో  చత్తీశ్ ఘర్ పుట్టింది.

ఇక్కడో మాట చెప్పుకోవాలి. సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడే తాము గెలిచామన్న సంగతి మరచిన తెలివి తక్కువ బిజేపినే ఈ పైన ౩ రాష్ట్రాలనీ  విభజించింది. ఆయా రాష్ట్రాల విభజన తరవాత బిజెపికి కష్టాలు మొదలైనాయి...... అలా తెలివిగా పావులు కదిపినది మరి ఇంకెవరు....కాంగ్రెస్సే....

5] మహారాష్ట్రా........ఇది త్రుటిలో విభజనను తప్పించుకొన్న రాష్ట్రం .......ఇక్కడ కాంగ్రెస్సుకి దీటుగా శివసేన మరియు బిజెపిలే కాకుండా ఎన్సిపిలు వచ్చిపడ్డాయి. ఎప్పుడో మరిచిపోయిన విదర్భ రాష్ట్రం పైకి వచ్చింది...బ్రిటిషు కాలంలో సెంట్రల్ ప్రావెన్సుకి రాజధానిగా ఉన్న నాగపూరే దీనికి కేంద్రం. అయితే, ఈలోగా శివసేనా బిజెపిల మధ్య సరిగా సయోధ్యలేకపోవటం......ఎన్సిపి  కాంగ్రెస్సుకి మిత్రుడిగా వ్యవహరించటంతో మహారాష్ట్ర  పీఠం కాంగ్రెస్సు ఆధీనం అయ్యింది. లేకపోతే ఈ పాటికి విదర్భ రాష్ట్రాన్ని కూడా అమాయక బిజేపినే ఏర్పాటు చెయ్యవలసిన పరిస్తితి వచ్చేది. 

6] దరిదాపులు ఇలాంటిదే రాజస్థాన్...ఇక్కడ కూడా కాంగ్రెస్సుకి బిజెపి వల్లనే ఎదురు దెబ్బ తగిలింది. అధికారాన్ని కోల్పోయింది. దానితో ఇక్కడ వేరే వేర్పాటు వాదులు లేకపోవటంతో...కులాల గొడవలు మొదలైనాయి. దానితో బిజెపి అధికారాన్ని కోల్పోయింది. మరల కాంగ్రెస్సు అధికారంలోనికి వచ్చింది. ఆ కులం వారికి చేసింది ఏమి లేదు కానీ. అక్కడ గొడవలు పెద్దగా కనపడటం లేదు.

7] అస్సాములో అక్కడి విద్యార్ధి పరిషద్ అధికారం లోనికి రాగానే అక్కడి బోడో లెండు ఉద్యమం పైకి లేచింది. దానితో కొత్త పార్టి మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు అక్కడ అధికారం కాంగ్రెస్సుదే....  మరీ....బోడోలేఁడు ఉద్యమం...., ప్రస్తుతానికి దానితో పనిలేదు.........

8]కమ్యునిస్టుల కోట బెంగాలులో ప్రయత్నం విరమిచుకుంది. ఎందుకంటే ఆ గూర్ఖా లేఁడు అని అడగబడేది భారత బోర్డర్ లో ఉన్నది. అయితే ఈ మధ్య మమత గెలవటంతో అది తిరిగి రాజుకో చూస్తోంది.

9]ఇలా బోలెడు ఉదాహరణలు చెప్పుకోవచ్చును......అంతదాకా ఎందుకు మనమే ఉన్నాము కదా.......తెలుగుదేశం అదే పనిగా గెలవటంతో....పాపం కాంగ్రెస్సు మంచిగా చెప్పా చూసింది......... అంటే తెలుగు దేశం పార్టిని ముక్కలు చేసి తద్వారా అధికారాన్ని పొందాలని.........కానీ, అక్కడ ఉన్నది కాంగ్రెస్సు తెలివే కదా!!!  కుదర లేదు...... దానితో ఎప్పుడో  1969లో మరచిపోయిన తెలంగాణా ఉద్యమం మరల టి.ఆర్.ఎస్స్  నీడగా మొదలైయ్యింది. కానీ, రాజశేఖర రెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్సు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.  రెడ్డిగారి పాలనలో కాంగ్రెస్సు పద్ధతిలో క్రమంగా ఆ ఉద్యమం నీటగలవటానికి కావాలిసిన అన్నీ రెడ్డిగారే చూసుకొన్నారు.  కానీ,  దురదృష్టవశాత్తూ రాజశేఖర రెడ్డిగారు మరణించటం జరిగింది.

పూర్తిగా నీటగలవని ఉద్యమం తిరిగి ఊపందుకుంది. దానితో ఈ ఉద్యమం కాంగ్రెస్సుకే భస్మాసుర హస్తంగా మారింది. ఇక్కడ ఓ ముచ్చట చెప్పుకోవాలి. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇలా కాంగ్రెస్సు కి ఝలక్ ఇచ్చింది మన తెలంగాణా తమ్ముళ్ళే. ఈ విధంగా తెలుగుదేశం పార్టిని నాశనం చెయ్యటానికి వేసిన అస్త్రం తిరిగి కాంగ్రెస్సునే గురిపెట్టింది. దానితో దిక్కుతోచక మూడు నాలుగు సంవత్సరాలుగా ముల్లోకాలు పరుగులు తీసి, తమని రక్షించే వారే లేరు కదా అని తలచి.....తిరిగి రాష్ట్ర విభాజనవైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా నటించసాగింది. ఎందుకంటే........ "విభజనాంధ్ర కంటే విశాలాంధ్ర " అధికారం వల్లనే లాభాలు ఎక్కువ అని కాంగ్రెస్సుకి తెలుసు.  కానీ, ఇంతలో....... కాంగ్రెస్సుకి  కత్తిగా ఉపయోగపడి,  దేశాన్ని ముక్కలుగోట్టటంలో ఆరితేరిన బిజెపి, తెలంగాణా మేము 2014కల్లా మేమిస్తాం అనటంతో.......కాంగ్రెస్సుకి తెలంగాణా భారం నుండి తప్పించుకోవటం కష్టమని తెలిసిపోయింది. అయితే ఏం, "కాంగ్రెస్సు మాత్రమే అధికారంలోనికి వచ్చేట్టుంటే మాకు అభ్యంతరం లేదని" చాలా ఓపెన్ గా పైకే చెప్పేసింది. దానికి కావాలిసిన రాష్ట్రంలోని ఏ ముక్కలు కలిపితే లాభమో చూసే పనిలో పడింది.  

అయినా ఇష్టంలేని పని చేస్తున్నట్లుగానే రేపు ఏమైనా అవకాశం వస్తుందేమో అన్నట్లుగా దిక్కులు చూస్తూ బడికి వెళ్ళటం ఇష్టంలేని కుర్రాడిలా తెలంగాణా వైపు అడుగుగులు వేస్తోంది. అయితే ఇది జరిగే వరకు నమ్మలేము. అన్నం[ఉద్యమం]వండటం వచ్చిన వీరిని.....అన్న ముద్ద పెట్టి మింగి, కడుపులోనికి వెళ్ళేదాకా నమ్మలేము. TOM & JERRY  కార్టూనులోలాగా కడుపులో చేయ్యపెట్టి అయినా తినే ముద్దని తీసే తెలివితేటలూ కాంగ్రెస్సుకి ఉన్నాయి. రాయలసీమని విభజిస్తే వారు ఊరుకోరు, 10 జిల్లాల తెలంగాణా ఇవ్వకపోతే వీరు ఊరుకోరు, రాష్ట్రాన్ని విభజిస్తే డబ్బులనీ/పిల్లల ఉద్యోగ అవకాశాలని హైదరాబాదులో మాత్రమే తెలివి తక్కువగా ఇరకబెట్టుకొన్న కోస్తా ఆంధ్రా వారు ఒప్పుకోరు. మరి దీని పరిష్కారం ఎలాగో కాంగ్రెస్సు వెండి తెర మీద మాత్రమే చూడగలము.

ఇదేదో గొప్ప విశ్లేషణ కాదు,  ఆ రెండు పత్రికలూ ఈనాడు-ఆంధ్రజ్యోతి.......ఆ మరిచాను మరో మూడోవ పత్రిక కలిసింది కదా సాక్షి....  దినపత్రిక వాళ్ళు వ్రాసినది కాదు...... మరే ప్రతి పక్షం వారు ఆరోపించినదీ కాదు.   స్వాతంత్రం వచ్చిన తరవాత కాంగ్రెస్సు తంత్రాని గమనిస్తే అందరికి తెలిసే విషయమే...గొప్ప రహస్యం ఏమి కాదు.... 

దీనిబట్టి మనకి తప్పనిసరిగా అర్ధం అవ్వ వలసినది ఏమంటే.......కాంగ్రెస్సు ఒక్కటే దేశ సమైక్యతని కాపాడే పార్టి.  కాకపోతే దీనికి కోపం తెప్పించ కూడదు....... అలా కోపం తెప్పించిన ప్రతిపక్షాలే దేశ............ సారి.......... రాష్ట్ర విచ్చిన్నాలకి కారణం.........!!!! నమ్మాలి మరి.......




@@@@@



రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి